ముంబయి: సరికొత్త వేగనార్ జనవరి 23 నుంచి మార్కెట్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన పలు వీడియోలను మారుతీ సుజుకీ విడుదల చేసింది. తాజాగా కారు ఇంటీరియర్ను వెల్లడించేలా వీడియోను విడుదల చేసింది. సరికొత్త వేగనార్ క్యాబిన్లో భారీ మార్పులు చోటుచేసుకొన్నట్లు ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఈ కారులో డ్యాష్బోర్డును పూర్తిగా మార్చేశారు. దీనికి స్మార్ట్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ను అమర్చారు. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు ఈ ఇన్ఫోటైన్మెంట్లో ఉన్నాయి. నలుపు, బూడిద రంగుల్లో డ్యాష్బోర్డును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతోపాటు సరికొత్త ఏసీ ఎయిర్ కండీషన్ వెంట్లను కూడా అమర్చారు. స్టీరింగ్లో కూడా మార్పులు చోటు చేసుకొన్నాయి. ఆడియో, టెలిఫోన్ కంట్రోల్స్ను స్టీరింగ్పైనే అమర్చారు. దీంతోపాటు ఆటోగేర్ ఫీచర్ను కూడా అందించనుంది.