‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు

నెల్లూరు : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో గత్యంతరం లేక ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేయకతప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఏదో అనుకుంటే ఇంకెదో మెడకు చుట్టుకుందని రామనారాయణరెడ్డి ఇప్పుడు కుమిలి పోతున్నారని పేర్కొన్నారు. 10 వేల కంటే ఎక్కువ తేడాతోనే ‘ఆనం’ పరాజయం పాలవుతాడని విజయ సాయి జోస్యం చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos