హోసూరు : పట్టణానికి సమీపంలోని నల్లూరు అగ్రహారం శివార్లలో వెంకటరమణ అనే రైతు దారుణంగా హత్యకు గురయ్యాడు. నల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన వెంకటరమణ(65) శుక్రవారం ఉదయం ఇంటి నుంచి గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగిరా లేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువులు అతని కోసం ఊరు చుట్టుపక్కల వెతికారు. ఎట్టకేలకు గ్రామ శివార్లలో రక్తపు మడుగులో వెంకటరమణ మృత దేహాన్ని గుర్తించారు. సిప్కాట్ పోలీసులు శవాన్ని హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. కేసు దర్యాప్తులో ఉంది.