తితిదే పాలక మండలి సమావేశం రద్దు

తితిదే పాలక మండలి సమావేశం రద్దు

తిరుమల : అధికారులు గైర్హాజరవడంతో మంగళవారం జరగాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం రద్దయింది. ఈ పరిణామం అనంతరం తితిదే చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ పాలక మండలి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. అయితే శ్రీవారి సన్నిధిలో స్వచ్ఛందంగా రాజీనామా చేయాలేనని నిస్సహాయత వ్యక్తం చేశారు. అధికారులు రానందున పాలక మండలి సమావేశాన్ని విరమించుకున్నామని చెప్పారు. ఈ సమావేశాన్ని నిర్వహించాలని నెల ముందే నిర్ణయించామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపైనే పాలక మండలి భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నారు. కాగా ఇదివరకే పాలక మండలి సభ్యత్వానికి చల్లా రామచంద్రా రెడ్డి, పొట్లూరి రమేశ్‌ బాబులు రాజీనామా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos