సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్న దారుణ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి ప్రత్యర్థులు తల్వార్లు, గొడ్డళ్లతో దాడిచేసి అత్యంత కిరాతంగా చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు… గ్రామానికి చెందిన వెంకన్న మాజీ సర్పంచ్. సహకార సంఘం ఎన్నికలు జరగాల్సి ఉండడంతో నిన్న రాత్రి కార్యకర్తలతో కలిసి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయిస్తున్నారు.ఈ సమయంలో ప్రత్యర్థులు వెంకన్నపై దాడికి వచ్చారు. దీన్ని గుర్తించిన వెంకన్న ప్రాణభయంతో పారిపోయి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. వెంబడించిన ప్రత్యర్థులు వెంకన్న ఆ ఇంటిలో ఉన్నట్లు గుర్తించి తలుపులు పగులగొట్టి మరీ లోపలికి ప్రవేశించారు.వెంకన్నపై తల్వార్లు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది..