కర్ణాటకలో చూడదగిన
సుందరమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. వీటిలో ఆధ్యాత్మికతో కూడుకున్నవే కాకుండా
మనసుకు ఆహ్లాదాన్ని పంచే ప్రదేశాలూ అనేకం ఉన్నాయి. కర్ణాటక ఇతిహాసాన్ని చూస్తే…ఎందరో
రాజులు శతాబ్దాల కిందటే శిల్ప చాతుర్యాన్ని చాటే అనేక కట్టడాలను నిర్మించారు.
వీటిలో ఒకటైన బాదామి పట్టణం బాగలకోటె జిల్లాలో ఉంది. అంతకు ముందు దీని పేరు
వాతాపి. బాదామి చాళుక్యుల రాజధానిగా క్రీస్తు పూర్వం 540 నుంచి 757 వరకు
కొనసాగింది. రాతి శిల్పాలతో కూడిన ఆలయాలకు ఇది నిలయం. ముఖ్యంగా అగస్త్య సరస్సు
చుట్టూ ఉండే ఎర్ర రాతి పర్వత సమూహాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.