చిచ్చు రేపుతున్న టిక్‌టాక్‌ భూతం..

చిచ్చు రేపుతున్న టిక్‌టాక్‌ భూతం..

చౌక ధరల్లో స్మార్ట్‌మొబైళ్లు,అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక వాట్సాప్‌,ఫేసుబుక్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు టిక్‌టాక్‌ తదితర మరెన్నో మొబైల్‌ యాప్‌ల సందడి ఎక్కువైంది.ఈ మధ్య కాలంలో టిక్‌టాక్‌ మరింత తీవ్రరూపం దాల్చింది.చిన్నపెద్దా తేడాలేకుండా అంతా టిక్‌టాక్‌ వీడియోల మాయలో పడి అనైతిక కార్యకలాపాలు,అనైతిక సంబంధాల వలలో చిక్కుకొని జీవితాలు,కాపురాలను కూల్చేసుకుంటున్నారు.ఈ క్రమంలో హత్యలకు సైతం తెగబడుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.తాజాగా తమిళనాడులో వెలుగు చూసిన రెండు టిక్‌టాక్‌ దారుణాలు కలకలం సృష్టించాయి. తమిళనాడులోని వేలూరులో భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటారు. భార్య భర్తలు సంసారం సాఫీగానే కొనసాగుతోంది. క్రమంలోనే వివాహిత టిక్ టాక్ కు అలవాటు పడింది. క్రమంగా టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ భర్తపిల్లలను పట్టించుకోవడం మానేసింది. అందంగా తయారై వీడియోలు పెడుతుండడంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆమె వీడియోలకు ఆకర్షితుడైన యువకుడు ఆమెకు నిత్యం మేసేజ్ లు పెడుతుండేవాడు. తరుచూ వారిద్దరు మాట్లాడుకోవడంకలుసుకోవడం వల్ల అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.తనను పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన భర్త.. భార్య చేస్తున్న పనులపై కన్నేశాడు. ఆమె యువకుడితో సంబంధం పెట్టుకుందని తెలుసుకొని వారిని మందలించాడు. ఇక నుంచి టిక్ టాక్ చేయద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇదేమీ పట్టించుకోని భార్య మళ్లీ టిక్ టాక్ చేస్తూసదరు యువకుడితో సంబంధం కొనసాగించింది. దీంతో  అతను భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మేరకు ఇప్పటికే ఆమెకు విడాకుల నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.టిక్ టాక్ లో వచ్చే లైకులు.. షేర్లకు మురిసిపోయిన భార్య ఏకంగా మాయలోపడి పచ్చని సంసారాన్ని కూల్చుకోవడం శోచనీయంగా మారింది. కోవలోనే చాలామంది మహిళలు టిక్ టాక్ మాయలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లు ఎంత త్వరగా మెల్కొంటే అంత మంచిది.ఇక ఇదే రాష్ట్రంలోని థేని జిల్లా నాగలాపురం ప్రాంతంలో ఆర్. సుగంతి అనే మహిళ సైతం టిక్‌టాక్‌ బారిన పడి సమాజం నుంచి బహిష్కరణకు గురయ్యే స్థితిని ఎదుర్కుంటోంది.కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటున్న సుగంతికి టిక్ టాక్ వీడియోల పిచ్చి ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో సుగంతి చాల వరకు టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.అందంగా ఉంటున్న సుగంతి ఖరీదైన లేటెస్ట్ అందమైన దుస్తులు వేసుకుని టిక్ టాక్ వీడియోల్లో నటించి వాటిని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టు చెయ్యడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. సుగంతి టిక్ టాక్ వీడియోలకు ఫిదా అయిన కొందరు యువకులు ఆమెకు టచ్ లోకి వచ్చారు. సుగంతి అతి కొద్ది కాలంలోనే టిక్ టాక్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన సుగంతితో కొందరు యువకులు అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అదే సమయంలో యువకులతో సుగంతి అసభ్యంగా, అభ్యంతరకరంగా, నోటితో చెప్పలేని మాటలతో మాట్లాడటం మొదలు పెట్టింది. సమయంలో కొందరు యువకులు సుగంతితో పాటు నాగలాపురం మహిళలను సైతం నోటికి వచ్చినట్లు చెడ్గగా మాటలతో చెప్పలేని బూతులు తిట్టారు. వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగలాపురం ప్రాంతానికి చెందిన మహిళల కుటుంబ సభ్యులకు మండిపోయింది.నాగలాపురం ప్రాంతానికి చెందిన మహిళలు, గ్రామస్తులు సుగంతి మీద మండిపడ్డారు. వెంటనే గ్రామం విడిచి వెళ్లిపోవాలని సుగంతికి చెప్పారు. అయితే మీ చేతనైయ్యింది మీరు చేసుకోండి, నేను ఇక్కడే ఉంటానని సుగంతి తేల్చిచెప్పింది. తరువాత గ్రామస్తులు పళనిచెట్టిపట్టి పోలీస్ స్టేషన్ ముట్టడించి వెంటనే సుగంతిని మా ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని ధర్నాకు దిగారు. సుగంతి, ఆమెకు సహకరిస్తున్న నాగజ్యోతితో పాటు మరో ఇద్దరు మహిళలను గ్రామం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.సుగంతి భర్త మిలటరీలో ఉద్యోగం చేసేవాడు. అయితే సుగంతి భర్త మరణించాడు. కుమార్తెతో కలిసి సుగంతి నాగలాపురంలో నివాసం ఉంటున్నది. భర్త లేడని, ఒంటరిగా కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంన్నదని, పోతేపోని అని సుగంతి మీద జాలి చూపిస్తే మా పరువు తీస్తోందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos