శ్రీనగర్ : పూంచ్ సెక్టారులోని నియంత్రణ రేఖ వద్ద పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైనికులు సోమ వారం భగ్నం చేశారు. ఇంటిగ్రేటెడ్ నిఘా గ్రిడ్ ద్వారా వారి ప్రయత్నాన్ని గుర్తించాయి. చొరబాటు దారులను అడ్డు కోవటంతో వారు కాల్పులకు దిగారు. సైనికులు ఎదురు కాల్పులు జరిపినపుడు గుర్తు తెలియని ఉగ్రవాది ఒకరు హతం అయ్యా డు. హతుడి నుంచి ఏకే – 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.