అంధ్రా సరిహద్దుల్లో అడ్డు గోడలు నిర్మించిన తమిళనాడు

అంధ్రా సరిహద్దుల్లో అడ్డు గోడలు నిర్మించిన తమిళనాడు

చిత్తూరు : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో గోడను నిర్మించారు.  కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తమిళనాడు సరిహద్దు వద్ద అధికారులు గోడ ను నిర్మించారు. వేలూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో స్థానిక అధికారులు తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే మూడు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై చిత్తూరు జిల్లా అధికారులు తమిళనాడు అధికారుల వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos