చిన్నమ్మ కోసం ప్రత్యేకంగా కచౌరీలు ..

చిన్నమ్మ కోసం ప్రత్యేకంగా కచౌరీలు ..

గుండెపోటుతో మంగళవారం రాత్రి కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ హఠాన్మరణం యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.సుష్మాతో తమకున్న అనుబంధాన్ని సుష్మాతో గడిపిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ బీజేపీ నేతలు సుష్మాకు కచౌరిలు అందించిన సందర్భాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున మధ్యప్రదేశ్లోని విదిశ నుంచి పోటీ చేసిన సుష్మా అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె విదిశకు రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. ఒకసారి విదిశ పార్లమెంటు పరిధిలోని రాయ్సేన్కు వచ్చారు.సంద్భంగా అక్కడి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు అందించేందుకు ఫలహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్ తీసుకువచ్చారు. సందర్భంగా ఆమె వారిని ఇక్కడ వంటకం ప్రసిద్ధి చెందింది? అని అడిగారు. దీనికి సమాధానంగా వారు ‘కచౌరిఅని చెప్పారు. దీంతో ఆమె నవ్వుతూ ‘అరే వాహ్… నాకు ఇష్టమైన వంటకమే ఇక్కడ ప్రసిద్ధి పొందింది. మీరు ఒక పని చేయండి… వేడి వేడి కచౌరిలు తెప్పించండి’ అని అడిగారు.దీంతో అక్కడున్న నేతలు వెంటనే వేడివేడి కచౌరిలను ఆమె టేబుల్ మీద ఉంచారు. అవి ఎంతో బాగున్నాయని చెబుతూ తాను ఎప్పుడు వచ్చినా ఈ కచౌరిలను తనకు అందుబాటులో ఉంచాలని కోరారు. కాగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ నిర్వహించే కార్యక్రమాలకు సుష్మా హాజరైనపుడు స్థానిక బీజేపీ నేతలు ఆమెకు ఫలహారంగా కచౌరిలను సిద్ధం చేసేవాళ్లమని గుర్తు చేసుకుంటున్నారు.సుష్మా స్వరాజ్‌ హఠాన్మరణంపై పాకిస్థాన్‌లో సైతం సానూభూతి వ్యక్తమవుతోంది. సుష్మా తమ పాకిస్తాన్ కి ప్రధాని అయితే బాగుండు అని పాక్ మహిళ అన్నదంటేఆమె గొప్పతనం ఎలాంటిదో ఇట్టే అర్థమౌపోతుంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos