సుర్జేవాలాపై ఫిర్యాదు

జైపూర్ : నకిలీ ఆడియో టేపులతో తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తున్నారని శాసనసబ చీఫ్ విప్ మహేష్ జోషి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు గోవింద్ సింగ్,ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి లోకేష్ శర్మలకు వ్యతిరేకంగా రాజస్తాన్ భాజపా అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ భరద్వాజ్ ఇక్కడి అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘8 సివిల్ లైన్స్లోని అశోక్ గహ్లోత్ నివాసంలో ఓఎస్డీ లోకేష్ శర్మ ఆధ్వర్యంలో నకిలీ ఆడియో టేప్లు సృష్టిస్తున్నార’ని ఆరోపించారు. వారందరిపై ప్రాథమిక సమాచార నివేదికల్ని దాఖలు చేయాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos