హైదరాబదు:2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో సన్ బర్న్ వేడుకల నిర్వహణకు అనుమతుల్లేవని సైబరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. సన్ బర్న్ పేరిట నిర్వహించతలపెట్టిన కార్యక్రమంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వేడుకల నిర్వహణకు అనుమతి కోసం నిర్వాహకులు సమర్పించిన దరఖాస్తును తిరస్కరించినట్లు చెప్పారు. మాదాపూర్లోని హైటెక్ సిటీ సమీపంలో ఈ ఈవెంట్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. ఇతర నగరాల్లో జరిగే సన్ బర్న్ వంటి వేడుక కాదని, అందుకే అనుమతులు నిరాకరించినట్లు వెల్లడించారు. ఈ ఈవెంట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈవెంట్ను సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్లైన్లో టిక్కెట్ విక్రయాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.