అమరావతి : కాబోయే ముఖ్యమంత్రి జగన్తో పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా సమావేశమవుతున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు కూడా తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనను కలుసుకున్నారు. వీరిలో సీనియర్ అధికారులు వరప్రసాద్, సంధ్యారాణి, కృష్ణబాబు, లక్ష్మీకాంతం, సత్యనారాయణ, ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, కార్తికేయ, రవి ప్రకాశ్, మిశ్రా ఉన్నారు. కొత్త ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సహకరించాలని జగన్ వారిని కోరారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులు కావచ్చని వినిపిస్తున్న హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కూడా జగన్తో సమావేశమయ్యారు. ఆయన ఇక్కడికి రావడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. దీనిపైనే ఉభయులూ చర్చించారని సమాచారం.