ఏపీ స్టాల్.. వావ్ అంటూ సెహ్వాగ్ ప్రశంసలు

ఏపీ స్టాల్.. వావ్ అంటూ సెహ్వాగ్ ప్రశంసలు

స్విట్జర్లాండ్: చంద్రబాబునాయుడు సర్కారుపై టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)లో ఏర్పాటు చేసిన ‘ఏపీ మెడ్‌టెక్ జోన్’ స్టాల్ అద్భుతంగా మెరిసిపోతోందని ప్రశంసించాడు. ఈ మేరకు అతడి ట్విట్టర్ ఖాతాలో ఏపీ మెడ్ టెక్ జోన్ స్టాల్ ఫొటోలను పోస్టు చేశాడు. అత్యాధునిక వైద్య పరికరాల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు ఏపీ ప్రబుత్వం ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ స్టాల్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఈ క్లస్టర్ జోన్ భారత్‌కే గర్వకారణం కాబోతోందని పేర్కొన్నాడు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్టణంలో ‘మెడ్‌టెక్ జోన్’ను ఆవిష్కరించారు. ఇందులో మెడికల్ 250 కంపెనీలు తమ ఉత్పత్తులను రూపొందించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఏపీ మంత్రి నారా లోకేశ్ దావోస్‌లో పర్యటిస్తున్నారు. నేడు ప్రారంభమైన ఆర్థిక వేదిక సదస్సు ఐదు రోజులపాటు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులు, పలువురు రాజకీయ నాయకులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos