మైనార్టీలను మట్టు బెడుతున్న భాజపా

ఉదయ్పూర్: మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణిచివేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఉదయ్పూర్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ప్రారంభోపన్యాసం చేసారు.‘ దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనకు గురి చేస్తోంది. గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణిచివేస్తోంది. మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవ ర్నెన్స్ అని చెప్పారు. దాని అర్థం దేశాన్ని నిట్టనిలువునా చీల్చడమేనా? బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను మన మధ్య చర్చించుకోవడానికి ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ ఒక అవకాశం కల్పిస్తుంది. నిరంతరం భయపెట్టడం, అభద్రతతో దేశ ప్రజలను బతికేలా చేయడం, మన సమాజంలో అంతర్భాగమైన , మన గణతంత్ర సమాన పౌరులైన మైనార్టీలను బలి పశువులను లక్ష్యంగా చేసుకుని క్రూరంగా హింసించడం చేస్తోంద’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos