ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్ని గడించాయి. బుధవారం ఉదయం 9.45గంటల వేళకు సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 41,575 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు ఎగబాకి 12,207 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.18 వద్ద దాఖలైంది. హెచ్యూఎల్, వేదాంత, టాటా స్టీల్, గ్రాసిమ్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్ని పొందాయి. యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గెయిల్ షేర్లు నష్ట పోయాయి.