శివమొగ్గ; ఇక్కడి సీగెహట్టిలో భజరంగ్దళ్ దళ్ కార్యకర్త 24 ఏళ్ల హర్ష దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకుల సమూహం ఇతనిపై మారణాయుధాలతో దాడి చేసి నట్లు తెలుస్తోంది. అతడు వృత్తిరీత్యా దర్జీ. హర్ష హత్య అనంతరం శివమొగ్గలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు హిందూ సంస్థలు హర్ష మరణించిన ఆస్పత్రి వద్ద నిరసనకు దిగాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. పలువురు వాహనాలకు నిప్పంటించి తగులబెట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.నగరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. జిల్లాలో 144 సెక్షన్ విధించారు. 1నుంచి12వ తరగతి వరకు తరగతులకు సెలవు ప్రకటించారు. హర్ష హత్యకు సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు.