హైదరాబాదు:సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న 18 పేజీలు సినిమాలో కృతి శెట్టి రకథానాయకిగా నటించనుంది. బన్నీవాసు నిర్మిస్తున్న దీనికి సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఆయనే ఈ సినిమాకి కృతి శెట్టి పేరును సిఫార్స్ చేశాడని అంటు న్నారు. ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా కృతి శెట్టి పరిచయమవుతోంది. అందులో ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటలో కృతి శెట్టి నవ్వుకు యువత మైమరచి పోతున్నారు.