హైదరాబాద్ : ప్రభాస్ నటించిన సాహో చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలున్నాయి. పారిస్లో ప్రఖ్యాత థియేటర్గా ది గ్రాండ్ రెక్స్లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఆ థియేటర్ గోడలపై సాహో ప్రచారం వీడియోల ద్వారా ఇప్పటికే మొదలైంది. ఈ థియేటర్ను 1932లో ప్రారంభించారు. ఇందులో ఒకేసారి 2,800 మంది కూర్చుని చిత్రాన్ని వీక్షించవచ్చు. బాహుబలి సినిమాను కూడా గతంలో ఇక్కడ ప్రదర్శించారు. రజనీకాంత్ నటించిన కబాలి, విజయ్ నటించిన మెర్సల్ చిత్రాలు సైతం ఆడాయి.