ఓటమికి సచిన్‌దే నైతిక బాధ్యత

ఓటమికి సచిన్‌దే నైతిక బాధ్యత

జైపూర్: లోక్‌సభ ఎన్నికల్లో తీన కుమారుడు వైభవ్ ఓటమికి ఉప ముఖ్యమంత్రి, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘జోధ్పూర్లో భారీ మెజార్టీతో గెలుస్తామని సచిన్ పైలట్ చెప్పారు. అక్కడ మనకు ఆరు గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేశామని చెప్పారు. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవ లేదు. కనీసం జోధ్పూర్లో ఓటమి బాధ్యత అయినా సచిన్ పైలట్ తీసుకోవాలి’ అని ఒక మాధ్యమ సంస్థ ముఖాముఖిలో పేర్కొన్నారు.‘గహ్లోత్ జీ మౌనంగా ఉన్నారు. వైభవ్ గహ్లోత్కు జోధ్పూర్ టికెట్ ఇవ్వాలని నేనే పార్టీని కోరాను’ అని సచిన్ పైలెట్ ఒక సభలో అన్నారు.దీనికి అశోక్ తీవ్రంగా స్పందిం చారు. ‘నా కుమారుడికి జోధ్పూర్ టికెట్ ఆయనే ఇప్పించినట్లయితే. ఇప్పుడు వైభవ్ ఓటమికి కూడా ఆయన బాధ్యత వహించాలి’ అన్నారు. ఏదేమైనా రాష్ట్రంలో పార్టీ ఘోరంగా ఓడినందుకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కలిసి బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. గహ్లా‌త్ వ్యాఖ్యలకు స్పందించేందుకు సచిన్ పైలట్ నిరాకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos