కరోనా నష్టం నుంచి కోలుకోవడానికి 12 ఏళ్లు.

ముంబై: కరోనా వల్ల కలిగిన నష్టాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి పదేళ్లకు పైగా సమయం పడుతుందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. కరోనా సమ యంలో రూ.52 లక్షల కోట్ల మేర ఉత్పత్తికి నష్టం కలిగినట్టు అంచనా వేసింది. 2020-21లో రూ.19.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.16.4 లక్షల కోట్లు, 2022-23లో రూ. 16.4 లక్షల కోట్లు చొప్పున నష్టపోయినట్లు మదింపు. కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా రెండు, మూడు విడతల కరోనా ప్రభావితం చేసాయి. ఉక్రెయిన్  – రష్యా యుద్ధ సంక్షోభం, నిత్యావసర సరకుల ధరలు ధరలు పెరిగిపోవడం, అంతర్జాతీయ సరఫరా సమస్యలు అంతర్జాతీయ, దేశీయ వృద్ధికి ప్రతి కూలతలని పేర్కొంది. ‘‘2020-21లో వాస్తవ వృద్ధి రేటు మైనస్ 6.6 శాతం. 2021-22లో 8.9 శాతం. 2022-23లో 7.2 శాతం. ఆ తర్వాత 7.5 శాతం స్థాయిలో కొనసాగుతుంది. దీని ప్రకారం దేశం 2034-35 నాటికి కోవిడ్ నష్టాల నుంచి పూర్తిగా బయట పడుతుంది’’అని వివరించింది.

తాజా సమాచారం