పీవోకే స్వాధీనానికి సన్నద్ధం

పీవోకే  స్వాధీనానికి సన్నద్ధం

న్యూ ఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ సైన్యం సర్వ సన్నద్ధంగా ఉందని పదాతి దళపతి జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఏమి చేయడానికైనా సైన్యం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు నిరీక్షిస్తున్నాం. ఇలాంటి విషయాల్లో కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఆదేశానుసారం సైన్యం రంగంలోకి దిగుతుంది. శాంతి, సామరస్యాలను నెలకొల్పే క్రమంలో సైన్యానికి జమ్ము-కశ్మీర్ ప్రజలు సహకరించాలి. ఎన్నో ఏళ్లుగా కశ్మీరీ ప్రజలు ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులను అనుభవించారు. పరిస్థితులను మార్చేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి కశ్మీరీ ప్రజలు సహకరించాల’ని విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos