వెంకీ సినీ ప్రస్థానం మొదలుపెట్టి నేటికి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయింది. వెంకీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సినిమా‘కలియుగ పాండవులు‘. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాను రామానాయుడు స్వయంగా నిర్మించారు.1986 ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. మొదటి సినిమాతోనే వెంకీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.ఆ తరువాత నుండి అతడి కెరీర్ దూసుకుపోయింది. వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు.ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కలియుగ పాండవుల చిత్రం ఫోటోను అభిమానులకు షేర్ చేశాడు..