రామసుబ్బారెడ్డికి ఊరట

రామసుబ్బారెడ్డికి ఊరట

ఢిల్లీ : మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిందితుడుగా ఉన్న షాద్ నగర్ జంట హత్యల కేసు విచారణను సుప్రీం కోర్టు  పూర్తి చేసింది. ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తాము దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అవసరం లేదని పిటిషనర్లు శివనారాయణరెడ్డి, లక్కిరెడ్డి సుభద్రమ్మ తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో వారి వినతిని న్యాయస్థానం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ అప్పీల్‌పై విచారణ కొనసాగించాల్సిందేనని కోరగా అత్యున్నత న్యాయ స్థానం తిరస్కరించింది. 1990 డిసెంబర్ 5న ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలోని షాద్ నగర్ బస్టాండులో అప్పటి కాంగ్రెస్ నేతలు దేవగుడి శివశంకర్ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌ రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos