న్యూ ఢిల్లీ: ఒలింపిక్స్తో పాటూ గతంలో ఇతర క్రీడాపోటీల్లో పాల్గొన్న అథ్లెట్లకు, పతక విజేతలకు ఇప్పటివరకూ నగదు బహుమతులు అందనందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ‘క్రీడాకారులకు చేసిన ఫోన్లు చాలు..ఇక నగదు బహుమతులు ఇవ్వండి. శుభాకాంక్షలతో పాటు నగదు బహుమతులు కూడా వారికి అందాలి..’’ అని ఇన్స్టాగ్రామ్లో ఘాటు వ్యాఖ్యానించారు. ఇవి ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్నాయి. ‘‘4 ఏళ్ల గడిచినా హరియాణా అథ్లెట్లకు అందని నగదు బహుమతులు’’ శీర్షికతో ఒక ఆంగ్ల ప్రతికలో ప్రచురితమైన వార్తా కథనాన్నీ ట్వీట్లో ప్రస్తావించారు.