కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఎన్నికల సందేశం

కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఎన్నికల సందేశం

న్యూ ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యకర్తలను ఉద్దేశించి కీలక సందేశం విడుదల చేశారు. బీజేపీని, ఆ పార్టీ భావాజాలాన్ని మట్టి కరిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలే కాంగ్రెస్ బలం అన్నారు. ఈ మేరకు రాహుల్ వీడియో సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా పంచుకుంది. ‘‘కార్యకర్తలే కాంగ్రెస్కు వెన్నెముక, పార్టీ డీఎన్ఏ. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ద్వయం భారత్ అనే భావానికి పూర్తిగా వ్యతిరేకం. వాళ్లు రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్య నిర్మాణాన్ని, ఎన్నికల సంఘం సహా పలు వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంపై మీరు క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. మీరే అసలైన రక్షకులు. ప్రజల ఆలోచనలను పార్టీ మేనిఫెస్టోలో చేర్చడంలో మీరు కీలక పాత్ర పోషించారు. మేము మీమీదే ఆధారపడ్డాం. మీరంటే మాకెంతో అభిమానం. మీకు నా శుభాకాంక్షలు. మనందరం కలిసి బీజేపీని, దాని భావజాలాన్ని ఓడించనున్నాం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos