జనం నాడిని పసిగట్ట లేక పోయాం

జనం నాడిని పసిగట్ట లేక పోయాం

న్యూఢిల్లీ: నూతన పౌరసత్వ చట్టంపై తీవ్ర స్థాయి నిరసన వ్యక్తమవుతుందని భాజపా ఊహించలేకపోయిందని కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ పేర్కొన్నారు. ‘ఈ స్థాయిలో నిరసనలు వ్యక్తమవు తాయని నేను అస్సలు ఊహించలేదు. నేనే కాదు ఇతర నేతలెవ్వరూ కూడా పౌరసత్వ సవరణ చట్టంపై ఇంతగా ఆగ్రహావేశాలు వ్యక్తమవు తాయని అనుకోలేద’ని ఒక ఆంగ్ల పత్రికతో జరిపిన ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. ముస్లింల నుంచి ప్రధానంగా వ్యతిరేకత వస్తుందని భావించాం కానీ ఇలా ప్రధాన నగరాలన్నీ నిరసనలతో మారు మోగుతాయన భావించలేదని మరి కొందరు బీజేపీ నేతలు తెలిపారు. దాదాపు రెండు వారాల పాటు దేశంలో విద్యార్థులు, యువత ఈ చట్టానికి వ్యతిరేకంగా మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలతో ప్రమాదం పొంచి ఉందని భావించిన అనేక మంది నిరసన తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos