హైదరాబాద్: దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక ప్రభు మంగళవారం సాయంత్రం తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆయన కనపడటం లేదని వారం రోజుల కిందట ఆయన మామగారు సురేంద్ర ప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనకోసం గాలింపులు చేపట్టారు. ప్రభు బుద్ధి పూర్వకంగానే తన చరవాణిని అందుబాటులో లేకుండా చేసినట్లు పోలీసులు భావించారు. ఆయన తన పెద్ద భార్య సుశీల, అత్తతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు అనుమానించారు.