సినిమా విడుదలకు ప్రపంచ కప్పు అడ్డు

  • In Film
  • June 22, 2019
  • 143 Views

హైదరాబాద్‌ : రామ్‌ కథా నాయకుడిగా నటిస్తున్న ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా విడుదలకు క్రికెట్‌ ప్రపంచ కప్పు ఫైనల్స్‌ అడ్డంకిగా మారింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌లు కథా నాయికలు. మణి శర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మాస్‌ హీరోగా రామ్‌ నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఆయన పాత్ర, డైలాగులు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వచ్చే నెల 12న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రపంచ కప్పు ఫైనల్స్‌ ఉండడంతో విడుదల తేదీని వాయిదా వేసినట్లు నిర్మాత ఛార్మి శనివారం తెలిపారు. జులై 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘మామ తేదీ మారింది. కానీ గదే తోపు…గదే ఊపు` అని రామ్‌ ట్వీట్‌ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos