యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ పోటీ

యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ పోటీ

లక్నో : నల్గొండ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ యూపీ జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తెలంగాణ మహిళ ఏంటి.. యూపీలో పోటీ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? స్థానిక నాయకుడు, మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య-శ్రీకళారెడ్డి ఆయనకు బదులుగా ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు. ధనుంజయ్ సింగ్పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.దీంతో తనకు బదులుగా తన భార్య శ్రీకళా రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిపారు ధనుంజయ్ సింగ్. బీఎస్పీ తరఫున జౌన్పుర్ ఎంపీగా శ్రీకళారెడ్డి పోటీలో నిలిచారు. ఇదే స్థానంలో బీజేపీ నుంచి కృపాశంకర్ సింగ్, ఎస్పీ నుంచి బాబూసింగ్ కుశ్వాహా పోటీ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos