నెల్లూరు : బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబరు వరకు పోలవరంలో ఎలాంటి పనులూ జరగవని, ఆలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కొత్త గుత్తేదారులకు పనులను అప్పగిస్తామని తెలిపారు. నవంబరు ఒకటి నుంచి పనులు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. టెండర్లను రద్దు చేయడం వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతాయన్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. దోపిడీని నివారించడానికి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.