కవిత ఓటమికి పీకే టీమ్ కారణమా?

కవిత ఓటమికి పీకే టీమ్ కారణమా?

గత లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ విజయం వెనుక ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ,లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం వెనుక కీలకపాత్ర పోషించిన ప్రశాంత్‌ కిషోర్‌ అలియాస్‌ పీకేపై వినిపిస్తున్న ఒక వార్త రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ తనయురాలు కల్వకుంట్ల కవిత ఓటమికి పీకేనే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.ఢిల్లీ నుంచి కొంతమంది రాజకీయ పెద్దలతో పాటు పీకే సన్నిహితులు చేసిన సూచనల మేరకు పీకే టీమ్‌ రహస్యంగా నిజామాబాద్‌లో కవితకు వ్యతిరేకంగా పని చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే నిజామాబాద్‌లో తమ పని మొదలు పెట్టిన పీకే టీమ్‌ బీజేపీ అభ్యర్థి అరవింద్‌ను గెలిపించినట్లు సమాచారం.కాగా కవిత ఓటమికి పీకే టీమ్‌ కూడా ఒక కారణమే కానీ పూర్తిగా పీకే టీమ్‌వల్లే కవిత ఓడిపోయిందని భావించలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారట.మరో ఆసక్తికర విషయమేంటంటే తెలంగాణలో తమకు అనుకూలంగా పని చేయాలంటూ ఇదే పీకేను తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారని అయితే ఎందుకో కేటీఆర్‌,పీకేల మధ్య డీల్‌ కుదరలేదని వార్తలు వినిపిస్తున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos