శ్రీనగర్ : భద్రతా దళాలపై పెట్రోల్ బాంబు విసిరారనే ఆరోపణపై ఎంఆర్ గంజ్ శ్రీనగర్, పిపి ఉర్దూ బజార్, పిపి బనమొహల్లా పోలీసులు ఐదుగురిని గురువారం అరెస్టు చేశారు. వీరు స్థానికులను, దుకాణాలు తెరవనీయకుండా యజమానులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినట్లూ పోలీసులు తెలిపారు.