తిరుమల: వ్యక్తిగత స్థాయిలోనే మిత్రుడైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మంగళ వారం కలుసుకున్నట్లు తెలుగు దేశం పార్టీ విధాన పరిషత్తు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఇక్కడ తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీనివాసులు రెడ్డి వైసిపిలోకి ఫిరాయించనున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మంగళవారం హఠాత్తుగా పవన్ కల్యాణ్తో భేటీ కావడం చర్చనీయాంశమైంది.