అమరావతి: శాసనసభ ఎన్నికల్లో నిడదవోలు నియోజక వర్గం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేశ్ ను బరిలోకి దించనున్నట్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ప్రకటించారు. ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.