న్యూ ఢిల్లీ:భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పరిణామాల గురించి ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించ నున్నారు. అన్ని రాజకీయ పక్షాల అధ్యక్షులతో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వీడియో ద్వారా మాట్లాడనున్నారు. గాల్వన్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న స్థలానికి రెండు దేశాలు పెద్ద సంఖ్యలో సైన్యాల్ని తరలిస్తున్నాయి.