ముంబై : భారత, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ రద్దయింది. కరోనా వైరస్ కారణంగా ఈ సిరీస్ను రద్దు చేయాల్సి వచ్చింది. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో గురువారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. లక్నో, కోల్కతాలలో మిగిలిన రెండు మ్యాచులు జరగాల్సి ఉంది. ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలో ఈ మ్యాచులను నిర్వహించాలని అనుకున్నారు. అయితే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సూచనలు, తదితరాలను దృష్టిలో ఉంచుకుని సిరీస్ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు స్వదేశానికి తిరుగుపయనమవుతోంది.