న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలు శాసన సభ సీట్ల పెంపు కోసం 2026 జనగనణ ముగిసేంత వరకూ వేచి చూడాలని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంత్రి నిత్యానందరాయ్ బుధవారం సమాధానం ఇచ్చారు. శాసనసభ స్థానాలసంఖ్య పెంపునకు రాజ్యాంగ సవరణ జరిగేంత వరకూ సీట్ల సంఖ్యను పెంచ లేమని వివరించారు. కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం శాసనసభ స్థానాల సంఖ్య ఏపీలో 225, తెలంగాణలో 153 పెరుగుతాయి. నిరుడు ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకూ. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు.