అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి, దానికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం అధికారులతో సమీక్షించారు. తాడేపల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీవీఐపీలు, ప్రజలు తిలకించడానికి చేస్తున్న ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జగన్కు వివరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ నగరంలో పలు చోట్ల డిజిటల్ తెరలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.