భారత రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన బుధవారమే ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. జూలై 23తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఈ లోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇలా నోటిఫికేషన్ విడుదలైందో, లేదో అలా రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నా… నామినేషన్ల దాఖలు మాత్రం ఢిల్లీలోని లోక్సభ సెక్రటేరియట్లోనే కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను 50 మంది ఎంపీలు ప్రతిపాదిస్తే తప్పించి నామినేషన్లే వేయడం కుదరదు. అయినా కూడా బుధవారం తొలి రోజే రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు దాఖలు కాగా…వాటిలో ఓ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు తెలియరాలేదు.