నిర్భయ దోషులకు ఇక ఉరే

నిర్భయ దోషులకు ఇక ఉరే

న్యూ ఢిల్లీ: నిర్భయ హత్యాచారుల్లో ఇద్దరు- వినయ్ కుమార్ శర్మ, ముఖేశ్ సింగ్ దాఖలు చేసిన క్యూరేటివ్ వ్యాజ్యాల్ని అత్యు న్నత న్యాయస్థానం మంగళ వారం కొట్టేసింది. మరో ఇద్దరు దోషులు పవన్ గుప్త, అక్షయ్ ఎలాంటి వ్యాజ్యాల్ని దాఖలు చేయ లేదు. దీంతో దోషుల్ని ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీసేందుకు తీహార్ చెరసాల్లో సన్నాహాల్ని ఆరంభించారు. క్యూరే టివ్ పిటిషన్ను కొట్టివేయడంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. క్షమాభిక్షకు రాష్ట్రపతి తిరస్కరిస్తే ఇక ఉరే తరువాయి అవుతుంది. అత్యాచారంలాంటి తీవ్రమైన నేరాల్లో ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదని ఇటీ వల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పష్టీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos