తాలూకాను విభజించారు…వసతులు మరిచారు

తాలూకాను విభజించారు…వసతులు మరిచారు

హొసూరు : ప్రజల సౌకర్యార్థం హొసూరు తాలూకాను రెండుగా విభజించినా, కొన్ని విషయాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదని సామాజిక కార్యకర్త శేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హొసూరు నుంచి విభజించిన సూళగిరి తాలూకాలో 42 గ్రామ పంచాయతీలు, 120 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. అయితే కొత్త తాలూకాలో ట్రెజరీ లేదని, ఒకే బ్యాంకు ఉన్నందున సూళగిరి తాలూకా వాసులు హొసూరుకు వెళ్లక తప్పడం లేదని వాపోయారు. సూళగిరిలో ఎస్‌బీఐ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త తాలూకా ఏర్పడిందనే సంబరమే కానీ, అటవీ ప్రాంత ప్రజలు తమ పనులను చక్కబెట్టుకోవడానికి రోజంతా వేచి ఉండాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos