అక్కినేని కోడలు సమంత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సమంత నటనకు,వ్యక్తిత్వానికి ఫిదా అయిన ప్రేక్షకులు,నెటిజన్లు కొద్ది కాలంగా సమంత ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో సమంత కూడా కీలకపాత్ర పోషించిన మహానటి చిత్రానికి మూడు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ‘మహానటి‘ సినిమాకి గాను కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమనటిగా అవార్డు వచ్చింది. దీనికి సంబంధించిన ఇండస్ట్రీలో చాలా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టారు. కానీ సినిమాలో కీలకపాత్ర పోషించిన సమంత మాత్రం ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. మూడు అవార్డులు అందుకున్న ‘మహానటి‘ బృందానికి కనీసం అభినందనలు కూడా చెప్పలేదు.తను నటించిన ‘ఓ బేబీ’ సినిమా గురించి ఇప్పటికీ ట్వీట్లు వేస్తూనే యాక్టివ్గా ఉన్న సమంత మహానటి గురించి మాత్రం స్పందించకపోవడంతో నెటిజన్లు సమంతపై ఓ రేంజులో ఫైర్ అవుతున్నారు..