సుప్రియా Vs సునేత్ర.. బారామతి పోరుకు నామినేషన్‌ వేసిన వదినా మరదళ్లు

సుప్రియా Vs సునేత్ర.. బారామతి పోరుకు నామినేషన్‌ వేసిన వదినా మరదళ్లు

ముంబై: లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి దృష్టినెలకొంది. ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించి నాలుగోసారి బరిలో నిలిచిన శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలే కు ఇప్పుడు కుటుంబసభ్యుల నుంచే తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన శరద్పవార్ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన భార్య సునేత్ర పవార్ను ఇక్కడి నుంచి బరిలో దింపారు. దీంతో వదిన, మరదలి మధ్య పోరుపై నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా బారామతి స్థానానికి సుప్రియా సూలే నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలు ఖచ్చితంగా తనతోనే నిలబడతారన్న నమ్మకం తనకుందన్నారు. నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య నీరే అని అన్నారు. ఈ ప్రాంతంలో కరవుపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు నామినేషన్ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.మరోవైపు, సునేత్రా పవార్ సైతం సుప్రియా సూలేపై పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ బారామతి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆమె తన భర్త అజిత్ పవార్తో కలిసి పూణెలోని శ్రీమంత్ దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సునేత్రా పవార్ మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos