అమరావతి: ఎన్నికల ప్రణాళిక హామీల్ని జగన్ ప్రభుత్వం అమలుచేసేందుకు కొంత సమయం వేచి ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ జయంత్యుత్సవంలో ప్రసంగించారు. పార్టీ మనుగడ, పురోగతికి కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, రాష్ట్రాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేసామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నించామన్నారు. కార్యకర్తల అభిప్రాయాలను ఆలకించి సమీక్షిస్తామని చెప్పారు. నిర్మా ణాత్మక విపక్ష పాత్ర పోషిద్దామని తెలిపారు.