కొత్త చిత్రాల పైరసీల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని నవీన్ చంద్ర,గాయతి
సురేశ్లు ప్రధాన తారాగాణంగా తెరకెక్కిన కొత్త చిత్రం హీరోహీరోయిన్లో ఓ సన్నివేశం
పలు వివాదాలకు తావిస్తోంది.బుధవారం విడుదలైన చిత్రం టీజర్లో చూపిన ప్రకారం కథలో హీరో
కొత్త చిత్రాలను పైరసీ చేసే నిందితుడిగా కనిపిస్తాడు.ఈ క్రమంలో ఎన్టీఆర్ కొత్త చిత్రాన్ని
పైరసీ చేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.అపుడు వచ్చే వారం
రామ్చరణ్ చిత్రాన్ని ఇంతకంటే ఎక్కువగా పైరసీ చేసి విడుదల చేస్తానంటూ ప్రకటించడంతో
ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.ఇదీ హీరోహీరోయిన్ టీజర్లో చూపిన దృశ్యం
సరిగ్గా ఇదే దృశ్యంపై విమర్శలు,వివాదాలు చెలగేరాయి.దీంతో ఈ సన్నివేశంపై చిత్రం హీరో
నవీన్చంద్ర మాట్లాడుతూ..అలాంటి ఫ్యాన్స్ కొందరు ఉన్నారని యూట్యూబ్ లో ఒక హీరో సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందంటే మరో హీరో ఫ్యాన్స్ తిట్టడం.. నెగెటివ్ గా మాట్లాడడం లాంటివి చేస్తున్నారు. హీరోలు బాగుంటారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇలా ఎందుకు ఇలా ఉన్నారు… ఫ్యాన్స్ ఎలా ఉంటే బాగుంటుందనే విషయం తమ సినిమాలో చర్చించామని తెలిపాడు. ఈ సినిమా మొదలు పెట్టిన సమయంలో చరణ్.. ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తారని తెలియదని.. అప్పటికి #RRR ప్రకటన రాలేదని అన్నాడు. దర్శకుడు రాసుకున్న కథ ఇదని చెప్పాడు.