అమరావతి: భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజుకు సారాయి వీర్రాజు అనే పేరు సార్థకమవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లా డారు. పరువు పోగొట్టుకున్న వీర్రాజు గుంటురు జిన్నా టవర్ వద్ద తన పరువును వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం చెప్పులపై కూడా జీఎస్టీని విధించడం దారుణమని మండిపడ్డారు. కాళ్లకు వేసుకునే చెప్పులను నెత్తిమీద పెట్టుకునే పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చిందని హేళన చేశారు.