అక్కాచెల్లెళ్ల అపహరణ, అత్యాచారం.. ఆపై హత్య

అక్కాచెల్లెళ్ల అపహరణ, అత్యాచారం.. ఆపై హత్య

లఖ్నవు: లఖింపూర్ ఖేరి జిల్లాలో మరో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించారన్న కారణంతో దళిత బాలికలైన ఇద్దరు అక్కా చెల్లెళ్లపై నలుగురు యువకులు అత్యాచా రానికి పాల్పడ్డారు. ఆపై హత్య చేసి చెట్టుకు వేలాడ దీశారు. లాల్పూర్వా గ్రామానికి చెందిన బాధిత బాలికలను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పెళ్లి చేసుకో మని గత కొంతకాలంగా వేధిస్తున్నారు. అందుకు వారు నిరాకరించడంతో కక్ష పెంచుకున్నారు. బుధవారం మధ్యాహ్నం బాలికలను కలిసి మాట్లాడాలని ఉందని మాయ మాటలు చెప్పి బైక్లపై ఎక్కించుకుని గ్రామ శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు వారి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. వారి ప్రతిపాదనను బాలికలు మరోమారు తిరస్కరించారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు తమ స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై వారిని హత్య చేసి ఆత్మ హత్యగా నమ్మించేందుకు అక్కడే ఉన్న ఓ చెట్టుకు వేలాడదీశారు. కుమార్తెలు కనిపించకపోవడంతో వారి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు గ్రామ శివా రులోని ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలు కనిపించాయి. అంతే, వారి గుండెలు పగిలి పోయాయి. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి నలుగురు నిందితులతోపాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసు లను గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృత దేహాలను పరీక్షల కోసం తరలించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం మాత్రం యూపీలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని ప్రకటనలు ఇచ్చుకుంటోందని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos