ఉత్తరాఖండ్‌ కార్చిచ్చు.. ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌  కార్చిచ్చు.. ఐదుగురు మృతి

న్యూ ఢిల్లీ : ఉత్తరాఖండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. బలమైన కార్చిచ్చు కారణంగా అక్కడి అడవులు తగలబడి పోతున్నాయి. దీంతో ఆర్మీ, ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా నీటిని వెదజల్లినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇక ఈ మంటలకు నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.గతేడాది నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్ అడవుల్లో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్లలో అటవీ ప్రాంతం ప్రభావితమైంది. దాదాపు ఆరు నెలలుగా అక్కడి అడవులు కాలి పోతున్నాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసిన మంటలు అదుపులోకి రావడం లేదు. మరోవైపు మంటల కారణంగా భారీగా ఎగసిపడుతున్న పొగ స్థానికులకు ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షం పడితేనే అడవుల్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందని డెహ్రాడూన్లోని వాతావరణ కేంద్రం తాజాగా తెలిపింది. ఈ వర్షంతోనైనా అడవిలో చెలరేగిన మంటలు అదుపులోకి వస్తాయని స్థానిక అధికారులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos