ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పురుగుల మందు డబ్బాతో మోత్కుపల్లి హల్‌చల్

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పురుగుల మందు డబ్బాతో మోత్కుపల్లి హల్‌చల్

హైదరాబాద్: ట్యాంక్బండ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశారు. సీఎం కేసీఆర్ను సమర్థించి తప్పుచేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘దళితబంధు అమలు కాకుంటే చస్తానని గతంలో చెప్పాను. దళితబంధు అమలు కావటం లేదు. నన్ను చనిపోమని దళిత యువత నాకు మెసేజ్లు చేస్తున్నారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకోమని దళిత యువత కోరుతోంది. కేసీఆర్ ముహూర్తం పెడితే పురుగు మందు తాగి చనిపోతాను. కేసీఆర్ గట్టిగా ఉన్నాడు. ఆయన ఎలాగూ చావడు. నేనైనా చచ్చిపోతాను. కేసీఆర్ మాటకు విలువే లేదు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్. మా ఇద్దరకీ మాటలు లేకున్నా దళితబంధు పెడ్తున్నాను రావాలని స్వయంగా కేసీఆర్ పిలిస్తే వెళ్లాను. దళితబంధుతో దళిత జాతికి మేలు జరుగుతోందని కేసీఆర్ను సమర్థించాను. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos